📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ

TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

Author Icon By Pooja
Updated: December 23, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ఫోన్(TG Politics) ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంటోంది. ఈ కేసులో తాజాగా సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరు కీలక నేతలకు త్వరలో SIT నోటీసులు జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

Read Also: Prabhakar Rao: ‘ఫోన్ ట్యాపింగ్’ మళ్లీ మొదటికి!

TG Politics: Will the SIT issue notices to KCR and Harish in the phone tapping case?

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ(TG Politics) ప్రత్యర్థులు, ముఖ్య నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విస్తృత దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించగా, అప్పటి ప్రభుత్వంలో కొందరు కీలక నేతల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ వాంగ్మూలం ఆధారంగా SIT దర్యాప్తును మరింత విస్తరించింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, భద్రతా విభాగాల పాత్రపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని ఆరోపణలు తీవ్రంగా మారుతున్నాయి.

ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో, వాటి ముగింపు అనంతరం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని SIT మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరై తమ వాదనలు వినిపించాలని కోరుతూ ఈ నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం.

ఈ కేసు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా మరింత ముదిరే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రజాస్వామ్య విలువలు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కీలక అంశం కావడంతో, ఈ కేసు భవిష్యత్తులో మరిన్ని సంచలన నిజాలను వెలికి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu SITInvestigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.