📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

TG: త్వరలో గిరిజన వర్సిటీకి ప్రధాని భూమి పూజ

Author Icon By Saritha
Updated: January 30, 2026 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(TG) మేడారం జాతరకు సామాన్య భక్తులతో పాటు రాజకీయ నాయకులు కూడా క్యూ కడుతున్నారు. అమ్మవార్లను దర్శించుకుని కోర్కెలను విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) గురువారం తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొన్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గిరిజన సంప్రదాయ వాయిద్యాల నడుమ మంత్రులు ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవతలకు ‘నిలువెత్తు బంగారం’ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి ఓరం మీడియాతో మాట్లాడుతూ, సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని, ఇది గిరిజన సమాజాలకు మహా కుంభమేళా లాంటిదని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

Read Also: Phone Tapping : కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన సిట్

PM to lay foundation stone for tribal university soon

రూ. 890 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు

గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ధరతీ ఆబా గిరిజన గ్రామ వికాస్ అభియాన్’ కింద రూ. 1 లక్ష కోట్లు, ‘పీఎం జన్-మన్’ పథకం కింద రూ. 24,000 కోట్లు కేటాయించినట్లు ఓరం తెలిపారు. తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేశామని పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం ఇక్కడికి వస్తారని తెలిపారు. (TG) ఈ ప్రాంత ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాయని వివరించారు. ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, బొగత జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి రూ. 80 కోట్లు, రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ. 40 కోట్లు, ఈ ఏడాది జాతర ఏర్పాట్లకు రూ. 3.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ పేరుతో ములుగు జిల్లాలో రూ. 890 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భూమిని అప్పగించిందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu Medaram Jatara Mulugu District Sammakka Saralamma Jatara Telangana Telugu News tribal festival

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.