📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG pension: ఫేషియల్ రికగ్నిషన్ తో చేయూత

Author Icon By Ramya
Updated: July 28, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట

హైదరాబాద్ : తెలంగాణలో చేయూత పెన్షనర్లకు గుడ్ న్యూస్. జూలై 29 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. వేలిముద్రలు సరిగా లేకపోవడం, మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందే 23 లక్షల మందికి ఇది వర్తిస్తుంది. దీనికోసం ప్రత్యేక యాప్, కొత్త స్మార్ట్ఫోన్లు, శిక్షణ వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫేషియల్ రికగ్నిషన్ సాధ్యం కానివారికి బయోమెట్రిక్ లేదా గ్రామ కార్యదర్శుల ద్వారా పెన్షన్ అందజేస్తారు. ఈ కొత్త విధానంతో పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో చేయూత పెన్షన్లు (TG pension) తీసుకునే వారికి గుడ్ న్యూస్. ఇక నుంచి పెన్షన్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు ఉండవు. జూలై 29 నుండి ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం ద్వారా చేయూత పెన్షన్లను పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ వినూత్న పద్ధతి ద్వారా 44 లక్షల మంది లబ్దిదారులకు పారదర్శకంగా పెన్షన్లు అందజేయటమ ప్రభుత్వ లక్ష ్యమని అధికారులు తెలిపారు.

TG pension: ఫేషియల్ రికగ్నిషన్ తో చేయూత

వృద్ధులకి పెన్షన్ అందకుండానే ఓటు..? బయోమెట్రిక్ సమస్యల నివారణకు ముఖ గుర్తింపు విధానం

TG pension: ప్రస్తుతం అమలులో ఉన్న బయోమెట్రిక్ విధానంలో (biometric system) కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా, చాలా మంది వృద్ధుల వేలిముద్రలు అదృశ్యం కావడంతో వారికి పెన్షన్లు అందడం లేదు. అంతేకాకుండా, కొంతమంది పెన్షనర్ల నిధులను ఇతరులు మోసపూరితంగా కాజేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారంతో (technical assistance) ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో, పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతున్న 23 లక్షల మందికి మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది. నగరాలు, పట్టణాల్లోని బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 21 లక్షల మందికి ప్రస్తుత విధానమే కొనసాగుతుంది. ఈ కొత్త విధానం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. పోస్టుమాస్టర్లు, పోస్టుమ్యాన్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు ఈ యాప్ను ఉపయోగించటంపై ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. సుమారు రూ.13 కోట్లతో 6,000 మంది పోస్ట్మ్యాన్లు, పోస్టుమాస్టర్లకు కొత్త స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు.

పెన్షన్ పంపిణీలో నూతన విధానం ప్రారంభానికి ఏర్పాట్లు

రాష్ట్రస్థాయి అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి కాగా.. నేడు పోస్టల్ సిబ్బంది, గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తారు. అనంతరం వారు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు. సోమవారం పెన్షన్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మంగళవారం (జూలై 29) నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. లబ్దిదారులు పోస్టాఫీసుకి వెళ్ళినప్పుడు వారి ఫోటో తీసి ఆధార్లో ఉన్న ఫోటోతో సరిపోల్చి యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత వారికి పెన్షన్ చెల్లిస్తారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీయలేని పరిస్థితిలో ఉంటే, వారికి బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ ఇస్తారు. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ రెండూ పనిచేయని సందర్భాలలో గ్రామ కార్యదర్శులు వేలిముద్రలు వేసి పెన్షన్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త విధానం వల్ల పెన్షన్ పంపిణీలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

తెలంగాణలో పెన్షన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?

ఈ పెన్షన్ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2014 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరులో ప్రారంభించారు. ఈ పథకానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ₹5,500 కోట్లు ఖర్చు చేస్తోంది.

తెలంగాణలో బీడీ కార్మికులకు పెన్షన్ పథకం ఏమిటి?

బీడీ కార్మికులకు ఆర్థిక ఉపశమనం కల్పించడానికి అప్పటి BRS ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది, దీని ద్వారా నెలకు రూ. 2,016 భత్యం అందించబడింది. ఫిబ్రవరి 28, 2014 కి ముందు EPF ఖాతాలు ఉన్నవారికి మాత్రమే అర్హత పరిమితం చేయబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Rave party: కొండాపూర్ లో వెలుగుచూసిన ఎపి ముఠాల రేవ్ పార్టీలు : 11 మందిపై కేసులు నమోదు

Breaking News Cheyutha Pension Facial Recognition latest news Pensioners Good News telangana government Telugu News TG Online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.