తెలంగాణ (TG) ప్రజల ఆత్మగౌరవం కోసం సకల జనులు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అధికారులు రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం అత్యంత నీచమైన నేరమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధ్వజమెత్తారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత
(TG) విచారణలో భాగంగా అధికారులు పిలిస్తే రాద్దాంతం చేస్తూ, హింసాత్మక నిరసనలకు పిలుపునివ్వడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. వ్యక్తుల ఆర్థిక, వ్యాపార, కుటుంబ రహస్యాల్లోకి తొంగిచూడటం అన్యాయమని, తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అని ప్రశ్నించారు. విచారణలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: