📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG: నేడు గాంధీభవన్లో రేవంత్, మీనాక్షి సమక్షంలో కొత్త, పాత డిసిసిలతో సమావేశం

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరుగుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోని క్షేత్రస్థాయి నాయకుల్లో పండగ వాతావరణం నెలకొన్నప్పటికి, ఓవైపు ప్రభుత్వవ్యతిరేకత, మరోవైపు ఇటీవల నియామకమైన డిసిసి (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల పట్ల అక్కడక్కడ వెల్లువెత్తుతున్న అసంతృప్తి అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామీణ నాయకులు ఎక్కడ తమపై ప్రతికూల ప్రభావం చూపుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అధిష్టానం క్షేత్రస్థాయి పరిస్థితితులకు భిన్నంగా డిసిసిలను ఎంపిక చేశారని, పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా, ప్రతికూల పరిస్థితిలో కూడా పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తమకు సామాజిక న్యాయం పేరుతో అవకాశం దూరం చేశారని పలు విధాలుగా అసంతృప్తి గళం వినిపిస్తున్న వేళ మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు నూతన డిసిసి అధ్యక్షులు, పూర్వ డిసిసి అధ్యక్షులు, టిపిసిసి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ లో జరుగబోతున్నది.

Read Also: Telangana: కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు.. రేవంత్ రెడ్డి

ఓ వైపు క్షేత్రస్థాయిలో మూడు విడుతల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. డిసెంబరు 3న చివరి దశ నామినేషన్ ఘట్టం మొదలు కాబోతున్నది. మొదటి, రెండు విడుతల సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth Reddy) ఎఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఎఐసిసి కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్ పాల్గొంటుండటంతో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు బిజెపి, బిఆర్ఎస్ పార్టీల కంటే అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

TG Meeting with new and old DCCs in the presence of Revanth and Meenakshi at Gandhi Bhavan today

ప్రతిష్టాత్మక ఎన్నికలు: కాంగ్రెస్ బలం పరీక్ష

అసెంబ్లీలో గత రెండు సంవత్సరాలుగా జరిగిన ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను వరుసగా గెలిపించుకొని ఆధిక్యతను నిరూపించుకొంటుంది. దీనికి ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనం. బిఆర్ఎస్ గడిచిన పదేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీన పరిచింది. బిఆర్ఎస్ అప్రతిహాతంగా గత పదేళ్ళు ఎన్నికలలో గెలుస్తు రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన నాయకులు కూడా మానసికంగా ధైర్యం కోల్పోయి పోటీ చేయడానికి వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు ప్రయాణం మినహా ఇతర హామీలు ఏవి కూడా అమలు చేయకపోవడంతో కొంత ప్రతికూల పరిస్థితి నెలకొంది.

గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రాతిపదికన జరగకపోయినప్పటికి అధికార కాంగ్రెస్ నాయకులకు ప్రజలలో ఆదరణ లభిస్తుందా, లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నది. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఎన్నికలు పరిమితమైన ప్రజాక్షేత్రంలో ప్రత్యేక పరిస్థితిలో జరిగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసిన విశాల గ్రామీణ ప్రజారాశుల మద్దతు అలాగే నిలుపుకుందా లేక తగ్గిందా, పెరిగిందా అనే అంశం కూడా తేటతెల్లం అవబోతుంది. కాంగ్రెస్ పార్టీ చిహ్నం బ్యాలెట్ పేపర్పై ఉండనప్పటికి పార్టీ బలపరిచే అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయి నాయకులకు అండగా నిలబడిన గ్రామీణ నాయకులను గెలిపించుకొని పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో తన ఆధిక్యతను ప్రదర్శించి సొంతపార్టీ నేతలపై, ప్రతిపక్షాలపై ఆధిపత్యం చాటుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఈ ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి ఉద్భోధిస్తున్నారు.

డిసిసి నియామక వివాదాలు: కొన్ని ఉదాహరణలు

స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఆఘమేఘాలపై సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగితా జిల్లాల డిసిసి అధ్యక్షులను ప్రకటించగా అవి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ ప్రకటన కొన్ని జిల్లాలో తుఫాను సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించనప్పటికి సంస్థాగత నిర్మాణంలో అధికార పార్టీ బిసిలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ డిసిసిలను ప్రకటించింది. ఎఐసిసి నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను పరిశీలకులుగా వచ్చి వారి సమక్షంలోనే బహిరంగ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. నేతల పనితీరు, కూర్పులో సామాజిక సమీకరణాల కోణాలను మేళవించి ఈ నియామకాలు చేపట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఈ నియామకాలు స్థానిక నేతల్లో అగ్గి రాజేస్తోంది.

జిల్లాలు వారీగా అసంతృప్తి గళాలు

ఎఐసిసి తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ స్థానిక సంస్థలు, డిసిసి అధ్యక్షుల నియామకం వల్ల పార్టీలో తలెత్తిన వివాదం ఏ విధంగా పరిష్కరించి అందరిని సంతృప్తి చెందేలా ఎలా చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

DCCAppointments GandhiBhavanMeeting Google News in Telugu hyderabad KomatireddyVenkatReddy Latest News in Telugu PanchayatElections RevanthReddy SocialJustice TelanganaPolitics Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.