రోడ్డు భద్రతా ప్రతిజ్ఞావెబ్సైట్ ప్రారంభంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : తెలంగాణ (TG) రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్యను తగ్గేంచేలా చర్యలు తీసుకోనున్నట్టు రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. అందులో భాగంగా మంగళశారం సచివాలయంలో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞా వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో ప్రతి మోటార్ సైకిల్ ఉన్న వ్యక్తి వద్దకు ఈ ఆన్లైన్ ప్రతిజ్ఞా సర్టిఫికెట్ చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వెబ్సైట్ ప్రారంభం తెలంగాణలో బాధ్యతా యుతమైన రహదారి ప్రవర్తన సంస్కృతిని నిర్మించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచి
స్తుందన్నారు.
Read Also: HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యలపై భర్త వాంగ్మూలం
ఇంటి నుంచే రోడ్డు భద్రత అలవాట్లు ప్రారంభం కావాలి
పౌరులు, తల్లిదండ్రులను రోడ్డు భద్రతకు స్పృహతో కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడం, ప్రాణాలను రక్షించడం ఉమ్మడి బాధ్యత అని అన్నారు. సురక్షితమైన అలవాట్లు ఇంట్లోనే ప్రారంభమై ప్రతి రహదారిపై కొనసాగుతాయని గుర్తించడం రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. (TG) పౌరులు ట్రాఫిక్ నియమాలను పాటించడానికి, రోడ్డుపై ఉన్న ప్రతి జీవితాన్ని గౌరవించడానికి పౌర ప్రతిజ్ఞను తీసుకోవచ్చు. తల్లిదండ్రుల ప్రతిజ్ఞను ఉదాహరణగా తీసుకొని, పిల్లలలో సురక్షితమైన అలవాట్లను రూపొందించవచ్చన్నారు. ఇది రోడ్డు భద్రతకు ప్రభుత్వం యొక్క బలమైన సంస్థాగత నిబద్ధతను ప్రతిబింబిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
విద్యార్థులకు తల్లిదంత్రులతో ఉన్న బంధాన్ని రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకోవడానికి రవాణా శాఖ రోడ్డు భద్రత ప్రతిజ్ఞా వెబ్సైట్ను ప్రారంభించిందిందని మంత్రి తెలిపారు. ఈ ప్రతిజ్ఞు రాబోయే కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర అగ్రిమెంట్ ద్వారా విద్యార్థులతో ఉన్న వారి బాండింగ్ తో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆకాక్షి ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రాష్ట్ర రవాణా అథారిటీ సభ్యుడు నవీన్ పెట్టెం పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: