రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్ : (TG) రాష్ట్రంలో భూముల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భూముల మార్కెట్ విలువ సవరణపై అధ్యయనం చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత యేడాది హైదరాబాద్ (HYD) ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల విలువ సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా సవరణ చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ మేరకు భూములు మార్కెట్ పెంపుపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం మాత్రం రాలేదు.
Read Also: Jithendra Singh: 2032 నాటికి 17 అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం
సమీకృత రిజిస్ట్రారు కార్యాలయాలు
ఈ క్రమంలో ఇటీవల (TG) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది. జీహెచ్ఎంసీ కోర్ అర్బన్ ప్రాంతాన్ని 12 జోన్లుగా విభజించింది. వాటిలో 60 సర్కిళ్లు, 300 డివిజన్లు ఏర్పాటు చేసింది. ఈ మార్పులను అనుసరించి ఆయా సర్కిళ్ల వారీగా భూముల వాస్తవిక విలువపై ఒక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సూచించినట్లు తెలిసింది.
మరోవైపు రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి చాలాకాలంగా ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ప్రస్తుతం కోర్ అర్బన్ మార్పుల కారణంగా వీటికి సంబంధించి కూడా సంస్కరణలు చేపట్టే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాబడి అధికంగా ఉండే ప్రాంతాలను కలుపుతూ కొత్తగా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటుచేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక రాష్ట్ర సర్కార్ రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకతను పెంచడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: