హైదరాబాద్: TG గతేడాది భారత బొగ్గు(Coal) రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అంతకుమించిన పురోగతిని సాధించాలని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(G. Kishan Reddy) పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కోల్ పీఎస్యూల అర్ధవార్షిక సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 నెలల సమయం ఉన్నందున, ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని, ముఖ్యంగా ఉత్పత్తి విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు.
Read Also: Telangana: లక్కీడ్రా పేరుతో దోపిడీ
సంస్కరణలు, సాంకేతికత వినియోగం
గతంలో వర్షాల కారణంగా ఉత్పత్తికి అంతరాయం కలిగినా, తర్వాత పుంజుకుని ఉత్పత్తిపై దృష్టి సారించాలని అన్ని సబ్సిడరీల సీఎండీలకు మంత్రి సూచించారు. వచ్చే మూడున్నరేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం సంస్కరణల ఆధారంగానే నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, బొగ్గు రంగంలోనూ వీలైనన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరారు. మన వద్ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి అత్యాధునిక వ్యవస్థ ఉన్నప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. సాంకేతికతను వాడుకుంటూ, వ్యవస్థను మరింత సరళంగా, ఫలితాలు సాధించేలా మార్చుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇతర సబ్సిడరీలలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను తెలుసుకుని అమలు చేయాలని, అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్ధతులను పాటించాలని చెప్పారు.
క్రిటికల్ అంశాలపై దృష్టి, లక్ష్యాలు
సీఎంపీడీ (సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్) ఓవర్ బర్డన్ టెస్టింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తిపై పనిచేయాలని మంత్రి సూచించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ త్వరగా అనుమతులు ఇస్తోందని, సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. కోల్ వాషరీస్ విషయంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, దీనివల్ల బొగ్గు దిగుమతులు తగ్గుతాయని పేర్కొన్నారు.
- కార్మికుల సంక్షేమం: కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్య సంరక్షణ విషయంలో రాజీపడొద్దని, ఉద్యోగులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని అందిస్తున్నామని తెలిపారు.
- మైన్ క్లోజర్: మైన్ క్లోజర్ విషయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, మూడేళ్లలో 141 డీకోల్డ్ మైన్స్ను మూసివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: