📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

TG IAS Officers: తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు

Author Icon By Rajitha
Updated: December 31, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ బదిలీల్లో జీహెచ్ఎంసీ, జిల్లా కలెక్టర్ పదవులు, కీలక శాఖల కమిషనర్ పోస్టులు ఉన్నాయి. పంచాయతీరాజ్ డైరెక్టర్ గా ఉన్న జి. శ్రీజననుగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (కూకట్పల్లి, శేర్ లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు) అదనపు కమిషనర్ బదిలీ చేశారు. నిజామాబాద్ కలెక్టర్గా ఉన్న వినయ్ కృష్ణారెడ్డిని జిహెచ్ఎంసీ (మల్కాజ్గరి, ఎల్బీనగర్, ఉప్పల్న్లు)లో అదనపు కమిషనర్ బదిలీ అయ్యారు. హైదరాబాద్ నగర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధం, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో వీరి పాత్ర కీలకంగా ఉండనుంది.

Plastic Ban: హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్

TG IAS Officers

వుమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఉన్న శృతి ఓజాకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థల పర్యవేక్షణ, గ్రామస్థాయి పరిపాలన బలోపేతం దిశగా ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామీణ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఇలా త్రిపాఠిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ను నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా బదిలీ చేశారు. నల్గొండ జిల్లాలో సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక నారాయణపేట జిల్లాలో అదనపు కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ ను నియమించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

IAS Officers Telangana latest news Telangana IAS Transfers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.