📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Latest News: TG High Court: హైకోర్టు తీర్పు దురదృష్టకరం : ఎంపి ఆర్.కృష్ణయ్య

Author Icon By Radha
Updated: October 10, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ :రిజర్వేషన్ల కేసులో నాలుగు వారాలు ఎన్నికలు వాయిదా వేస్తూ కోర్టు(TG High Court) స్టే ఇవ్వడం అన్యాయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) అన్నారు. ఇది ‘బీసీల నోటి కాడ అన్నం ముద్దను లాక్కోవడమే’ అన్నారు.

Read also: DCC Presidents Selection: రేపు ఏఐసిసి పరిశీలకుల రాక

ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పులకు వ్యతిరేకంగా నాలుగు వారాలు ఎన్నిక వాయిదా వేయడం పట్ల ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో 14 బీసీ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆర్ కృష్ణయ్య హైకోర్టు(TG High Court) వద్ద మీడియాతో మాట్లాడుతూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను తీవ్రస్థాయిలో ఖండించారు.

‘గురువారం జడ్పిటీసి, ఎంపిటీసీల స్థానాలపై వేలాదిమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు ఎలా చేయిస్తాది’ అన్నారు. కేసు నాలుగు రోజులుగా కోర్టులో నడుస్తుంది. ఇస్తే మొదటి రోజే ఇవ్వాలి. కానీ రెండుసార్లు స్టే ఇవ్వబోమని కోర్టు ఇవ్వడానికి నిరాకరించింది. చాలా వాదాలను విన్నాక ఇలా స్టే ఇవ్వడం బాధాకరం.

30 బీసీ సంఘాలు ఇంప్లీడ్ కేసులు వేశారు. పిటిషనర్ల వాదన కూడా వినకుండా స్టే ఎలా ఇస్తారు’ అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయం అన్నారు. బీసీలను అవమానపరిచారని దీనికి భారీ మూల్యం చెల్లిస్తారని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా కలిసి రావాలని
పిలుపునిచ్చారు.

ఉన్నత న్యాయస్థానాలు బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వరుసగా ఇస్తున్నందున దీనికి ప్రధానంగా జడ్జీలలో బీసీ ఎస్సీ ఎస్టీలు లేకపోవడమే ప్రధాన కారణం హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలా నియామకాల్లో ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో బిసి సంఘాల ప్రతినిధులు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, నీల వెంకటేష్, అనంతుల రామమూర్తి గౌడ్, అల్లంపల్లి రామకోటి, టీ. రాజకుమార్, రాజు నేత, చెరుకు మణికంఠ, లింగయ్య యాదవ్, పగిలిన సతీష్, రాందేవ్ మోడీ, ఆంజనేయులు, రామ నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BC Reservations local body elections 2025 r krishnaiah Telangana news Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.