హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు(TG High Court) కఠిన సూచనలు జారీ చేసింది. మీ వద్ద ఉన్న అధికారాన్ని వినియోగించడం మంచిదే కానీ, దాన్ని శాసనసమ్మతంగా, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించాలని న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి(B. Vijay Sen Reddy) వ్యాఖ్యానించారు. రోజూ హైడ్రాపై వందలాది పిటిషన్లు వస్తుండటంతోనే కమిషనర్ను వ్యక్తిగతంగా విచారణకు పిలవాల్సి వచ్చిందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
Read Also: Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకున్న గ్రామస్తులు

హైకోర్టు వ్యాఖ్యలు
ఖానామెట్ గ్రామంలోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనుల్లో కోర్టు ఇచ్చిన యథాతథ స్థితి ఆదేశాలు ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ జరుగుతూ, న్యాయమూర్తి(TG High Court) ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చడం, ప్రజల ఆస్తులను నష్టం కలిగించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. చిన్న గజాల ప్లాట్లు కొనుగోలు చేసిన సాధారణ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడం సమంజసం కాదని ప్రశ్నించింది.
ఎఫ్టీఎల్ పరిధిలో కూడా సక్రమమైన పట్టా భూములు ఉండొచ్చన్న మరో బెంచ్ తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. “అధికారమే అంతిమం కాదు… పద్ధతి, చట్టం, విధానం కీలకం” అని కోర్టు హైడ్రాకు హెచ్చరిక జారీ చేసింది. భవిష్యత్లో మళ్లీ కోర్టుకు హాజరయ్యే పరిస్థితి రానీయకుండా వ్యవహరించాలని కమిషనర్కు సూచించింది.
పిటిషనర్ల వాదనలు
పిటిషనర్ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ—
- ఏప్రిల్లోనే కోర్టు ఆదేశాలు ఇచ్చినా పనులు ఆగలేదని
- నోటీసులు ఇవ్వకుండా చెరువు పనులు చేపట్టడంతో భూములు ముంపునకు గురయ్యాయని
- పట్టా భూమి కాదా అని తేల్చే అధికారం హైడ్రాకు లేదని – వాదనలు వినిపించారు.
కమిషనర్ వివరణ
విచారణలో కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ—
- కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని
- స్టే వచ్చిన వెంటనే కార్యకలాపాలను నిలిపివేసామని
- తమ్మిడికుంట ప్రాంతంలో పేరుకుపోయిన మెడికల్ వ్యర్థాలను తొలగించామని
- ఆ ప్రాంతం డంప్యార్డ్లా మారిపోయి ప్రజారోగ్యంపై ప్రమాదం నెలకొన్నందున చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ప్రభుత్వ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ హైడ్రా చర్యలు చట్టప్రకారమే జరిగాయని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: