TG: ఆ ప్రదేశంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్..

Read Time:  1 min
TG
TG
FONT SIZE
GET APP

TG: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 65పై పాదచారుల భద్రతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హయత్‌నగర్ సమీపంలోని భాగ్యలత మరియు లెక్చరర్స్ కాలనీ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జుల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వంతెనల పనులను మూడు నెలల్లో పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఖరారు చేశారు.

Read also: VenkaiahNaidu: విద్య, వైద్యం తప్ప మిగతావి ఫ్రీగా అవసరం లేదు

TG

TG

హయత్‌నగర్ ప్రాంతంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడంతో రహదారి దాటే పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం, విద్యాసంస్థలు ఎక్కువగా ఉండటంతో ఉదయం–సాయంత్రం వేళల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జుల నిర్మాణం అత్యవసరంగా మారింది.

ఇదిలా ఉండగా, జాతీయ రహదారి విస్తరణ పనులకు కొందరు ప్రైవేటు ఆస్తుల యజమానులు కోర్టు స్టే ఉత్తర్వులు తీసుకురావడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలే అత్యంత ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన, అవసరమైతే పోలీసు బందోబస్తుతోనైనా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జులు పూర్తయితే ఎన్‌హెచ్‌ 65పై ప్రమాదాలు తగ్గి, పాదచారులు సురక్షితంగా రహదారి దాటే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.