అనర్హులకు ‘చేయూత’ పింఛన్లు (pension) అందుతున్నాయనే ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో నిర్వహించిన పైలట్ సర్వేలో పలు అక్రమాలు వెలుగు చూసాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు సరిపోని తొమ్మిది మంది వ్యక్తులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల్లో పని చేస్తున్న వారి తల్లిదండ్రులు కూడా ఉండటం ప్రత్యేకంగా గమనార్హం.
Read also: Savitri: మహానటి జయంతి..రేపటి నుంచి ‘సావిత్రి మహోత్సవ్’

TG Government
బోగస్ పింఛన్లు బయటపడే
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపి ఇంటింటికీ సామాజిక తనిఖీ నిర్వహించారు. లబ్ధిదారుల జాబితా, అర్హత ప్రమాణాలను సమీక్షించిన అధికారులు చిన్న మండలమైన మావలలోనే ఇంతమంది అనర్హులు ఉండటం ఆశ్చర్యంగా భావించారు. జిల్లావ్యాప్తంగా పూర్తి స్థాయి సర్వే చేపట్టితే మరింత పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు బయటపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 73 వేల మందికి పైగా పింఛన్లు అందుతున్నాయి. ప్రభుత్వం నెలకు 16 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయిస్తోంది. గ్రామాల్లో వార్షిక ఆదాయం 1.5 లక్షల లోపు, పట్టణాల్లో 2 లక్షల లోపు ఉండాలి అనే ప్రమాణాలు అమలులో ఉన్నప్పటికీ, సర్వేలో అవి పాటించని వారు పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో గుర్తించిన తొమ్మిది మందికి పింఛన్ చెల్లింపులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. పథకాన్ని పారదర్శకంగా మార్చి నిజంగా అర్హులైన వారికి మాత్రమే లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: