News Telugu: TG: రేవంత్ సర్కార్ శుభవార్త.. ఒకే సారి 130 మందికి ప్రమోషన్లు..

Read Time:  1 min
Good news from Revanth Sarkar
Good news from Revanth Sarkar
FONT SIZE
GET APP

రాష్ట్రంలో ఉద్యోగుల వేచి చూపులకు తెరదించుతూ రేవంత్ సర్కార్ (Telangana government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ పదోన్నతులకు ప్రభుత్వంఆమోదం తెలిపింది. దీంతో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు పొందారు. సమాచారం ప్రకారం, 7 ఏళ్ల తరువాత గ్రేడ్-1 కార్యదర్శుల్లో అర్హులైన 9 మందికి సూపరింటెండెంట్ పదవి ఇవ్వగా, సీనియర్ అసిస్టెంట్లలో 130 మందికి పైగా ఉద్యోగులకు ఒకేసారి ప్రమోషన్లు మంజూరు చేశారు. ఈ ఉత్తర్వులను పీఆర్ & ఆర్డీ డైరెక్టర్ గురువారం విడుదల చేశారు.

Read also: Sridhar Babu: స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ

Good news from Revanth Sarkar

Good news from Revanth Sarkar.. Promotions for 130 people at once..

ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను

రేవంత్ సర్కార్ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టిపెట్టడంతో, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించడం, నిధుల విడుదల, పదోన్నతులు వంటి విషయాల్లో వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ నిర్ణయంతో సంతోషించిన పీఆర్ శాఖ ఉద్యోగులు, సంఘ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, ప్రస్తుతం పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను కూడా వెంటనే క్రమబద్ధీకరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.