News Telugu: TG: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. వచ్చే నెల నుంచి అమలు

Read Time:  1 min
News Telugu: TG: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. వచ్చే నెల నుంచి అమలు
FONT SIZE
GET APP

హైదరాబాద్‌లో రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యాన్ని ప్లాస్టిక్ కవర్లకు బదులు మల్టీపర్పస్ గుడ్డ బ్యాగుల్లో ఇవ్వనున్నారు. పర్యావరణహితంగా రూపొందించిన ఈ బ్యాగులపై ఆరు గ్యారంటీల లోగోలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ముద్రించారు. మొదట అక్టోబర్‌లోనే ఈ విధానాన్ని ప్రారంభించాలనుకున్నారు కానీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున అమలుకు సిద్ధమవుతోంది.

Read also: TG Crime: కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య

ఒక్క వ్యక్తి రోజుకి 10–12 ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నట్లు

ప్రస్తుతం ప్రతి రోజు ప్లాస్టిక్ సంచులు ఉపయోగించబడుతున్నాయి. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో ఒక్క వ్యక్తి రోజుకి 10–12 ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఇది పర్యావరణానికి ముప్పుగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాటన్, పేపర్ వంటి పర్యావరణహిత సంచుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతున్నందున హైదరాబాద్‌లో కార్డుల సంఖ్య ఇప్పటికే 8,28,150కి చేరింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.