📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు శుభవార్త.. 53 మందికి ప్రమోషన్లు

Author Icon By Rajitha
Updated: December 24, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఎట్టకేలకు శుభవార్త లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుని, ఈ శాఖలో పనిచేస్తున్న 53 మంది అధికారులకు ప్రమోషన్లు కల్పించేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 2025 చివర్లో పలు పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకూ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి.

Read also: BV Raghavulu: ప్రమాదకర చట్టాలకు కేంద్రం ఆమోదం

Good news for Excise Department

పై హోదాలకు వెళ్తే అవి కోల్పోతామనే భయంతో

డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 23 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 14 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లతో పాటు అడిషనల్, జాయింట్ కమిషనర్లకు పదోన్నతులు కల్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఈ శాఖలో సమగ్రంగా పదోన్నతులు జరగకపోవడంతో అర్హులైన అధికారులు ఏళ్ల తరబడి నిరీక్షణలోనే ఉన్నారు.

అయితే పదోన్నతులు ఇంతకాలం ఆలస్యం కావడానికి ప్రధాన కారణంగా క్షేత్రస్థాయి అధికారాల అంశం మారింది. డిప్యూటీ కమిషనర్లకు మాత్రమే తనిఖీ అధికారాలు ఉండటంతో, పై హోదాలకు వెళ్తే అవి కోల్పోతామనే భయంతో కొందరు అధికారులు ప్రమోషన్లు వద్దని లేఖలు రాసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా కిందిస్థాయి అధికారుల పదోన్నతులూ నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్యకు ముగింపు పలికినట్టుగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Excise Department latest news telangana excise Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.