📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

TG: గుడ్డు ధరల కారణంగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు బంద్..

Author Icon By Rajitha
Updated: December 26, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రభావితమవుతోంది. గత కొన్ని నెలలుగా గుడ్డు ధర రూ.6 నుంచి రూ.8కు పెరగగా, కొన్ని ప్రాంతాల్లో రూ.10 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల కారణంగా పీఎం పోషణ్ పథకం కింద విద్యార్థులకు అందించాల్సిన గుడ్ల సరఫరా కష్టంగా మారింది.

Read also: Telangana: కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

eggs have been stopped in the midday meal.

మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారానికి మూడుసార్లు గుడ్డు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం చాలా పాఠశాలల్లో రెండు రోజులు మాత్రమే గుడ్డు అందిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 మాత్రమే చెల్లిస్తుండగా, బహిరంగ మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో వంట కార్మికులు గుడ్లు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల గుడ్లకు బదులుగా అరటిపండ్లు ఇస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 వేల పాఠశాలల్లో దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రభుత్వం నేరుగా గుడ్లు సరఫరా చేస్తే సమస్య తీరుతుందని సూచనలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో అల్పాహారం అమలు చేయడంతో పాటు, మధ్యాహ్న భోజన మెనూ, వంట కార్మికులకు చెల్లించే మొత్తంపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయనున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Eggs latest news mid day meal Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.