నల్గొండ: ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఓ నవ దంపతుల జీవితాన్ని కాలం కబళించింది. పెళ్లైన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదం(road accident) రూపంలో మృత్యువు ఆ యువతిని కబళించగా, యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
Read also : US work permit : అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు – భారతీయులకు షాక్
ప్రేమ వివాహం, ప్రమాదం
నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండలం, చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్, నాంపల్లి మండలం, దామెర గ్రామానికి చెందిన అనూష (22) ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో 14 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసుల కౌన్సెలింగ్తో పెద్దలు సమ్మతించి, మూడు రోజుల క్రితం గుడిలో వారి వివాహాన్ని తిరిగి నిర్వహించారు. పెళ్లి అనంతరం నవీన్ తన భార్య అనూషతో కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గుర్రంపోడు గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గుర్రంపోడు సమీపంలోని వంతెన మీదకు వచ్చేసరికి వీరి ద్విచక్ర వాహనం మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
భర్త కోసం భార్య ఆత్మహత్యాయత్నం
ఈ ఘటనలో నవీన్ కిందపడి తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లగా, భార్య అనూష అమాంతం వంతెన గోడపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. నీటిలో మునిగిపోయిన అనూషను స్థానికులు సుమారు 20 నిమిషాల పాటు వెతికి ఒడ్డుకు చేర్చారు. అనూషతో పాటు నవీన్ను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అనూష మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. నర్సింగ్ పూర్తి చేసిన అనూష త్వరలోనే ఉద్యోగంలో చేరాలనుకుంది.
కుటుంబాల్లో విషాదం
అందరినీ ఎదిరించి పెళ్లిచేసుకోవడం, పెద్దలను ఒప్పించి మరోసారి ఒకటైన ఆ దంపతుల ఆశలు అడియాసలు కావడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కాళ్ల పారాణి ఆరక ముందే నవవధువు మృతి చెందడం, యువకుడు ప్రాణాలతో పోరాడుతుండటం అందరినీ కలిచివేసింది.
ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది?
నల్గొండ జిల్లా, గుర్రంపోడు సమీపంలోని వంతెన వద్ద జరిగింది.
నవ వధువు అనూష ఎలా మరణించింది?
రోడ్డు ప్రమాదం తర్వాత ద్విచక్ర వాహనం నుంచి వాగులో పడిపోవడం వల్ల మరణించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :