ప్రేమ.. పెళ్లి ఈరెండు విలువైనవే. కాలికి తడి అంటకుండా సముద్రాన్ని దాటగల మేధావి ఉండవచ్చునేమో కానీ ప్రేమ-పెళ్లిబంధాలను కాదని జీవితాన్ని మానవుడు దాటలేడు. మనసు నిత్యం ప్రేమ కోసం పరితపిస్తుంది. తోడు కోసం అన్వేషిస్తుంది. అందుకే యవ్వనంలో రాగానే నూటికి నూరుశాతం ప్రేమలో పడతారు. ప్రేమించిన వారితో జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. కానీ కొందరి ప్రేమలు ఫలించవు. అవి పెళ్లి వరకు రావు. దీంతో కొందరు ఈ బంధం నుంచి బయటకు రాలేక అర్థాంతరంగా తనవు చాలిస్తుంటారు. ఓ యువతి కూడా ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
Read Also: Mysore crime: భర్తను చంపాలని యాక్సిడెంట్ నాటకం.. ఇట్టే దొరికిపోయిన భార్య

ప్రేమ పెళ్లి..మూడునెలలకే ఇష్టం లేదని చెప్పిన ప్రియుడు నారాయణపేట జిల్లా(TG Crime) కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు శ్రీశైలం(సూరి) అనే యువకుడు. ఈయనకు శ్రీలత(21) అనే యువతి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో మూడునెలల క్రితం వీరిద్దరు ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే యువతి ఇంట్లో వీరి పెళ్లి విషయం తెలియడంతో వారు పెళ్లిని అంగీకరించలేదు. దీంతో శ్రీలత అప్పుడే పురుగుల మంది తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
ఇష్టం లేదనడంతోనే ఆత్మహత్య
ఇక చేసేది లేక శ్రీలత(TG Crime) కుటుంబ సభ్యులు పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా, తనకు శ్రీలతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని శ్రీశైలం తేల్చి చెప్పాడు. అయితే మూడురోజుల క్రితం శ్రీలతకు మరో యువకుడితో వివాహం జరిపించారు ఆమె తల్లిదండ్రులు. ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో నవవధువు అయిన శ్రీలత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీశైలం మోసం చేయడంతోనే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా, ఆది తమ పరిధిలోకి రాదని పోలీసులు ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: