TG: ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ లో CM రేవంత్ పర్యటన

Read Time:  1 min
Telangana housing scheme
Telangana housing scheme
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:50 గంటలకు బేగంపేట నుండి హెలికాప్టర్ లో అదిలాబాద్‌‌కు చేరుకుంటారు. అక్కడ  చనాక కొరట పంపు హౌస్ ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా సదర్ మట్ బ్యారేజీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ మినీ స్టేడియంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సా.4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

Read Also: Cynic School : దేశ భద్రత విషయంలో ముందుంటాం – సీఎం రేవంత్

Revanth enabling corruption in state, says BRS
TG: CM Revanth’s visit to undivided Adilabad today

ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రారంభించటం ఆనవాయితీ

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్‌ రెడ్డి అన్ని కార్యక్రమాలను ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ స్థూపాన్ని సందర్శించిన ఆయన, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించడం ఆశలను చిగురింపజేసింది. తాజాగా మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్నందున నేడు సీఎం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.