గత ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయంగా విభజించిందని (TG) సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు గతంలోనే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు నచ్చిన లక్కీ నంబర్ ఆధారంగా జిల్లాల ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల అవసరాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల విభజన జరిగిందని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న కొన్ని జిల్లాల రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Read Also: TG: కిషన్ రెడ్డి KCRకు దత్తపుత్రుడు: CM రేవంత్
జిల్లాలపై ఆలోచన చేస్తాం
ఈ విషయంపై తాజాగా (TG) సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో ఇవాళ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏ జిల్లాను తొలగించదని అన్నారు. కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.
జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే కచ్చితంగా బహిరంగంగా ప్రజలకు చెప్పి, అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాల సూచన తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామని వెల్లడించారు. ఎవరి ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని అపోహాలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా.. భూపలపల్లి జిల్లా ఎక్కడికి పోదని ఇది తన హామీ అని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: