📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

TG: మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక చర్చ

Author Icon By Saritha
Updated: January 31, 2026 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన హస్తం పార్టీ, పట్టణ ఎన్నికల్లోనూ అదే విజయాన్ని సాధించాలనుకుంటోంది. (TG) తాజాగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుండే సమీక్షా సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయ‌గా అందులో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్‌లో జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి చౌదరి పాల్గొన్నారు.

Read Also: Medaram Jatara: తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో ట్రాఫిక్ కష్టాలు

(TG) మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుండే సమీక్షా సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్

(TG) మున్సిపల్ ఎన్నికల నివేదికను మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికలపై సీఎం మంత్రులకు కీలక సూచనలు చేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 90శాతం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని టార్గెట్ నిర్దేశించారు. ఎక్కడా కూడా రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 3న నామినేషన్లకు తుది గడువు ఉండటంతో ఆ లోపు వారితో విత్‌డ్రాలు చేయించాలని ఆదేశించారు. ఎక్కడ కూడా రెబల్స్ పోటీలో ఉండొద్దని అలా ఉంటే పార్టీకి ప్రమాదమని హెచ్చరించారు. టికెట్లు రాని వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ అడంగా ఉంటుందని నాయకులకు తగిన ప్రతిఫలం దక్కుందని చెప్పారు.

తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరననున్నాయి. ఫిబ్రవరి 13న కౌంటింగ్, ఫిభ్రవరి 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ నెల 28న నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా జనవరి 30న ముగిసింది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

congress party Latest News in Telugu Mahesh kumar Goud panchayat elections Revanth Reddy Telangana Municipal Elections Telugu News Zoom meeting review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.