📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

TG: టెట్ రద్దు కోసం ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ

Author Icon By Saritha
Updated: January 24, 2026 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : ఇన్సర్వీస్ టీచర్లకు గుదిబండగా మారిన టెట్ తప్పనిసరి రద్దుకై ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి (Pingili Sripal Reddy) తెలిపారు. (TG)టెట్ తప్పనిసరి నిబంధనను రద్దు చేయాలనే డిమాండ్తో అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫివో) వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోని పిఆర్ టియు టిఎస్ కార్యా లయంలో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర బాధ్యుల సమావేశం జరిగింది.

Read Also: Mahesh Kumar Goud: కెటిఆర్ నిజాలు చెప్పాలి

ఉపాధ్యాయుల భవిష్యత్తు, ఉద్యోగ నిర్ధారణ కోసం పోరాటం

సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. (TG) ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమ స్యను పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు. ఢిల్లీలోని, జంతర మంతర్ వద్ద ఉదయం 10 గంటల నుంచి ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తు న్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలా ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన బోతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, అడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితోపాటూ వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



AIFFO All India Teachers Federation in-service teachers Latest News in Telugu Pingili Sri Palreddy Telangana Teachers Protest Telugu News TET Mandatory

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.