Telugu News: TG: బస్సు ప్రమాద విషాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Read Time:  1 min
TG
TG
FONT SIZE
GET APP

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల(Chevella) వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు(RTC bus) ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాండూరు, చేవెళ్ల ప్రాంతాలకు చెందిన వారేనని సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Read Also: Ramya Krishna: అమ్మోరు’ అమ్మవారు, ‘శివగామి’ రాజమాత – కొత్త లుక్

 TG

ఘటనాస్థలం వద్ద స్థానికుల నిరసన

ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో, ఘటనాస్థలం వద్ద స్థానికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులను ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెరుగుతున్న మృతుల సంఖ్య

గాంధీ ఆసుపత్రి, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.