తన మాటలు రాచరికపు పోకడలకు, నియంతృత్వానికి నిదర్శనమని తెలంగాణ (TG) జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై BRS నేత కేటీఆర్ స్పందించారు. మున్నిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు నిలబడ్డా… కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ అంటున్నారని… మున్సిపల్ ఎన్నికల్లో గుణం చూసి ఓటు వేయాలని చెప్పారు. పని చేసే వాళ్లకు, మంచి అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని అన్నారు.
Read Also: HYD Crime: హుస్సేన్సాగర్లో దూకి యువతి ఆత్మహత్య?

ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు
చెడ్డ వాళ్లకు ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా? అని ప్రశ్నించారు. జాగృతి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తారని తెలిపారు. కవితపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని, తాను ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో ఎంతో మంది మాట్లాడుతుంటారని, ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: