📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

TG Bonalu: పాతబస్తీలోని అన్ని ఆలయాల్లో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్(చార్మినార్): హైదరాబాద్ పాతనగరంలో ఆదివారం అత్యంత వైభవంగా బోనాల (TG Bonalu) జాతర ఉత్సవాలు జరిగాయి. ఆషాడ మాసం సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం (Mahankali Temple), హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయం, మీరాలమండి మహంకాళేశ్వరి ఆలయం, సుల్తాన్ షాహి జగదాంబ ఆలయం. ఉప్పుగూడ మహంకాళి ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మీ మందిరం, దూద్బౌలిలోని మహరాజంజ్ పైనీరు ముత్యాలమ్మ దేవాలయంతో పాటు పాతనగరం ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి పరిధిలోని ఇరవై రెండు దేవాలయాలలో ఆదివారం ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి.

అమ్మ వారికి పట్టు వస్త్రాలు అందచేశారు

శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో ప్రభుత్వం తరుపున అమ్మ వారికి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటి స్పీకర్ రామచందర్ నాయక్, మాజీ మంత్రి గీతారెడ్డి, బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి చైర్మన్ జి. రాఘవేందర్, కమిటి ప్రతినిధులు ఎస్.పి.క్రాంతి కుమార్లు అమ్మవారికి పూజలు నిర్వహించారు. సుల్తాన్హి శ్రీ జగదాంబ ఆలయంలో కమిటి చైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు (Bonala Festival) వైభవంగా జరిగాయి. టిపిసిసి అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్, ఎంపి ఈటల రాజేందర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్తో పాటు పలువురు ఆలయాన్ని సందర్శించి అమ్మ వారికి పూజలు జరిపారు. పాతబస్తీ దూద్బాలిలోని పైనీరు ముత్యాలమ్మ ఆలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, మందిరం కమిటి చైర్మన్ ఆనంద్ గుప్తలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మీ మందిరంలో అమ్మ వారికి ప్రభుత్వం తరుపున రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎమ్మెల్యే దానం నాగేందర్తోపాటు పలువురు మంత్రులు, ఎంపిలు, కార్పొరేటర్లు, అధికా రులు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వ హించారు. కాగా పాతబస్తీలోని 268 మహంకాళీ ఆలయాలలో ఆదివారం వైభవంగా బోనాలు ఉత్సవాలు జరిగాయి .

Read hindi news: hindi.vaartha.com

Read also: Telangana Rising: తెలంగాణ రైజింగ్-2047.. రాష్ట్రం అందరినీ ఆహ్వానిస్తోంది : సిఎం రేవంత్ రెడ్డి

Akkanna Madanna Temple Bonalu Breaking News latest news Old City Hyderabad Bonalu Pothuraju dance Telangana Bonalu Festival Telangana Culture Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.