తెలంగాణ (TG) రాజకీయాల్లో ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంశంపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. ఈ విధానాన్ని తెరపైకి తెచ్చి ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ‘వన్ పర్సన్.. వన్ పార్టీ’ విధానాన్ని తెచ్చేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని తొలగించేందుకే 400 సీట్లు అడిగారని అందుకే ప్రజలు వారికి సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఓటు హక్కును కాలరాయడానికి ‘SIR’ పేరిట ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: HYD Crime: హుస్సేన్సాగర్లో దూకి యువతి ఆత్మహత్య?

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: