Latest News: TG Bandh: బంద్ తో ప్రయాణికుల ఇక్కట్లు..

Read Time:  1 min
TG Bandh
TG Bandh
FONT SIZE
GET APP

తెలంగాణలో బీసీ బంద్(TG Bandh) నేపథ్యంలో జూబ్లీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సిన బస్సులు నిలిచిపోయాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ, వారాంతపు సెలవులు సమీపించినప్పటి నుంచి ప్రయాణికులు బస్టాండ్‌లో కష్టపడుతున్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read also: TGPSC: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు పత్రాలు

TG Bandh

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవల నిలిపివేత

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ల పోరు కొనసాగుతోంది. కరీంనగర్ ప్రాంతంలోని 11 డిపోల్లో, ఖమ్మాలో ఆరు డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బీసీ సంఘాలు, పార్టీ నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. హనుమకొండలో పలు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి.

TG Bandh: బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మహబూబ్‌నగర్, నాగర్, కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా బంద్కు మద్దతు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల శ్రేణులు వివిధ రకాల ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.