📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG: గోదావరిఖనిలో ఒకే రాత్రిలో 46 ఆలయాల కూల్చివేత ?

Author Icon By Rajitha
Updated: November 7, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG: గోదావరిఖనిలో (Godavarikhani) ఒక రాత్రిలోనే ఆలయాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పరిధిలో గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రహదారి వెంట ఉన్న దారిమైసమ్మ ఆలయాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మొత్తం 46 ఆలయాలు ఒకే రాత్రిలో కూల్చివేయబడ్డాయి. పాతకాలం నుండి ప్రజల భక్తి కేంద్రాలుగా ఉన్న ఈ దారిమైసమ్మ ఆలయాలు రహదారి పక్కన ప్రజలు ప్రతిష్ఠించినవి. ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందనే నమ్మకంతో ప్రజలు ఈ ఆలయాలను నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ ఆలయాల కూల్చివేత ప్రజల ఆవేదనకు కారణమైంది. ఉదయం లేచి చూసేసరికి మైసమ్మ విగ్రహాలు కనిపించకపోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్య చేపట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read also: Weather Update:మొంథా తుఫాన్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత

TG: గోదావరిఖనిలో ఒకే రాత్రిలో 46 ఆలయాల కూల్చివేత ?

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని

TG: ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. దారిమైసమ్మను కూల్చివేయడం ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అవమానమని మండిపడుతున్నారు. మరోవైపు బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌ వంటి హిందూ సంస్థలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆలయాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని కూడా కొందరు కోరారు. కాగా, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ప్రకారం రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు సేఫ్టీ కమిటీ సూచనలతో ఆలయాలు తొలగించామని తెలిపారు. ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అయితే ప్రజల భక్తి, మత భావాలను దెబ్బతీసే ఈ చర్యపై చర్చలు, విమర్శలు కొనసాగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Godavarikhani latest news Telangana Telugu News temple demolition

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.