📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: TG: వరద బాధిత కుటుంబాలకు 12.99 కోట్ల సాయం

Author Icon By Sushmitha
Updated: November 12, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: మొంథా తుఫాను(Montha cyclone) ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ తెలంగాణ(TG) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో దెబ్బతిన్న 8,662 ఇళ్లకు రూ.15,000 చొప్పున సహాయం అందిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. వీరికి తక్షణ సాయంగా ప్రభుత్వం మొత్తం రూ.12.99 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.

Read Also: CRI Report: భారత్‌లో ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రం – 30 ఏళ్లలో 80 వేల మంది మృతి

TG

తుఫాను ప్రభావం, మృతుల సంఖ్య

అక్టోబర్ 27 నుంచి 30 వరకు వరుసగా నాలుగు రోజులు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కోతగూడెం, నల్గొండ భారీ వర్షాలు కురిశాయి. ఈ భీకర వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 16 మంది మృతిచెందగా, వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి.

రహదారులకు భారీ నష్టం

మొంథా తుఫాను కారణంగా 14 జిల్లాల్లో రోడ్లు, భవనాల శాఖ భారీ నష్టాన్ని గుర్తించింది. మొత్తం 334 ప్రాంతాల్లోని 230.41 కిలోమీటర్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

జిల్లా కలెక్టర్లు పంపించిన ప్రాథమిక నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ తక్షణ సాయాన్ని మంజూరు చేసింది.

సీఎం ప్రకటించిన ఇతర పరిహారాలు

మొంథా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వరంగల్ పర్యటనలో పరిహారాలను ప్రకటించారు:

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

financial aid flood relief Google News in Telugu housing damage. Latest News in Telugu montha cyclone telangana government Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.