हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Telangana Bhavan : తెలంగాణ భవన్‌ వద్ద టెన్షన్ ..టెన్షన్

Sudheer
Telangana Bhavan : తెలంగాణ భవన్‌ వద్ద టెన్షన్ ..టెన్షన్

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో సిట్ (SIT) విచారణ జరుగుతున్న నేపథ్యంలో, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. రైతన్న సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించడం ద్వారా తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు. కేసీఆర్‌ను వేధించడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని కార్యకర్తలు మండిపడ్డారు.

Nara lokesh : కేంద్ర బడ్జెట్‌పై లోకేశ్ స్పందన, ఏపీకి భారీ లాభాలా?

కేవలం తెలంగాణ భవన్‌కే పరిమితం కాకుండా, కార్యకర్తలు కేసీఆర్ నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళా కార్యకర్త కింద పడిపోవడం పరిస్థితి తీవ్రతను పెంచింది. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు భారీగా మోహరించినప్పటికీ, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా తమ నేతకు మద్దతుగా ముందుకు దూసుకెళ్లడం అక్కడి యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

బీఆర్‌ఎస్‌వీ శ్రేణుల నిరసన మరోవైపు, కేసీఆర్ నివాసానికి వెళ్లే రహదారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌వీ (BRSV) విద్యార్థి విభాగం కార్యకర్తలు భారీ సంఖ్యలో నందినగర్‌కు చేరుకుని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువరిస్తూ అరెస్టులు చేపట్టారు. కేసీఆర్‌ను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రభుత్వం తక్షణమే ఇలాంటి దుర్మార్గపు వైఖరిని వీడాలని వారు డిమాండ్ చేశారు. సిట్ విచారణ ముగిసే వరకు ఈ ఉద్రిక్తత కొనసాగేలా కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870