AP TG education issue : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం వెలుగులోకి వచ్చింది. తెలుగు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అధికారాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య న్యాయపోరాటం మొదలైంది.
ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్పై వివాదం
ఏపీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది.
పోలీసు అధికారులకు సూచించారు.
Read Also: Lokesh : నారా లోకేష్ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ వర్సిటీ వాదన
రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిగా ముగియకపోవడంతో విజయనగరం, గుంటూరు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు తమ పరిధిలోనే ఉన్నాయని తెలంగాణ వర్సిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించే హక్కు ఏపీ వర్సిటీకి లేదని చెబుతూ లీగల్ నోటీసులు పంపింది.
ఏపీ వర్సిటీ స్పందన
ఈ వివాదంపై ఏపీ తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు స్పందించారు. తెలంగాణ వర్సిటీ నుంచి లీగల్ నోటీసులు అందినట్లు ఆయన ధృవీకరించారు. ఈ అంశంపై ప్రభుత్వం తరఫున తగిన సమాధానం ఇస్తామని తెలిపారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తమ తెలుగు విశ్వవిద్యాలయానికి “సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం”గా పేరు మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు వర్సిటీల మధ్య ఈ న్యాయపోరాటం ఎలా ముందుకు సాగుతుందోనని ఆసక్తి నెలకొంది.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :