हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: Urea-రోడ్లపైనే వంటావార్సు – పాస్పుస్తకాలను తగలబెట్టిన రైతులు

Pooja
Telugu News: Urea-రోడ్లపైనే వంటావార్సు – పాస్పుస్తకాలను తగలబెట్టిన రైతులు

Urea-హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరతపై నిరసనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. యూరియా ఇవ్వడం లేదనే ఆగ్రహంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులు, అధికారులను రైతులు నిర్బంధిస్తున్నారు. మరోపక్క పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను తగుల పెట్టడం, రోడ్లపై వంటావార్పు, ధర్నాలు, ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర యూరియా(Urea) కొరతపై రైతులు వరుస నిరసనలు చేపట్టారు. యూరియా కోసం ఎదురు చూసినా తగినంత సరఫరా లేకపోవడంపై ఆందోళన చెందుతున్న రైతులు రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేటలో పట్టాదార్ పాస్బుక్లు, ఆధార్ కార్డుల ఫోటో కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. గంటల తరబడి వేచి చూసినా యూరియా టోకెన్లు జారీ చేయడంలో విఫలమైన సొసైటీ అధికారుల తీరు పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన కొందరు రైతులు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డుల ఫోటో కాపీలను తగలబెట్టారు.

Urea

సహకార సంఘాల వద్ద ఉద్రిక్తత

వ్యవసాయ సహకార పరపతి సంఘం సిబ్బందిని రైతులు కార్యాలయాల్లో బంధించారు. ఇదే జిల్లాలోని మరిపెడలో యూరియా స్టాక్ వచ్చిందనే సమాచారం అందడంతో రైతులు పీఏసీఎస్ గేటు దూకి లోపలికి పరిగెత్తారు. యూరియా కోసం పరకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిలోని మాందారిపేట వద్ద రైతులు నిరసన తెలిపారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కూడా యూరియా కొరత కారణంగా రైతులు సహకార సంఘం కార్యాలయాల వద్ద పొడవైన క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని, అయినా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా తగినంతగా సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు.

కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలంలోని గానుగపాడు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. తగినంత పరిమాణంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని జూలూరుపాడులో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బందిని కార్యాలయంలోనే బంధించారు.

యూరియా సరఫరా లోపాలు

ప్రతి రైతుకు కనీసం మూడు బస్తాల యూరియా అందించాల్సి ఉండగా, కేవలం ఒక బస్తా మాత్రమే ఇచ్చారని విమర్శించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కార్యాలయానికి వచ్చి షట్టర్ తెరిచారు. సహకార సంఘం అధికారులు 40 టన్నుల యూరియాకు ఆర్డర్ ఇచ్చామని, కానీ పది టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని తెలిపారు. స్టాక్స్ వచ్చిన వెంటనే మిగిలిన యూరియా ఇస్తామని చెప్పారు.

జాతీయ రహదారులపై నిరసనలు

వరంగల్ జిల్లా ఖానాపురం వద్ద జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో రైతులు వంటావార్పు నిర్వహించారు. నిరసన కారణంగా వాహనాలు అనేక కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. క్యూలైన్లో రైతులు స్పృహ కోల్పోయిన సంఘటనలు అనేక చోట్ల చోటుచేసుకున్నాయి. యూరియా తగినంతగా సరఫరా చేయాలని డిమాండ్(Demand) చేస్తూ ఇదే జిల్లాలోని నర్సంపేటలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూపాలపల్లి, డోర్నకల్ మరియు మరిపెడ వంటి అనేక చోట్ల ఇలాంటి నిరసనలు జరిగాయి.

రైతులు ఏ కారణంతో పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను తగలబెట్టారు?
యూరియా సరఫరా లేకపోవడంపై ఆగ్రహంతో నిరసనగా తగలబెట్టారు.

యూరియా కొరత ఎక్కువగా ఏ జిల్లాల్లో కనిపిస్తోంది?
మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రంగా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-hyderabad-railway-arrangements-for-festive-rush/business/542509/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870