हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Telugu News: Telangana-గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసిన హైకోర్టు

Pooja
Telugu News: Telangana-గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసిన హైకోర్టు

Telangana-పరీక్షలంటే ఎంతో కష్టపడి చదవాలి. ఇక పోటీపరీక్షలు అంటే ఎంతో ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. పాస్ అయితే తమ జీవితమే మారిపోతుందని కలలు కనే యువత ఎందరో. ఎందుకంటే వారు రాత్రీపగలు కష్టపడి చదివి ఉంటారు. కానీ వాటన్నింటిని కోర్టులు ఆ పరీక్షా ఫలితాలను రద్దు చేస్తే ఆ వేదన భరించడం కష్టమే. ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? నేడు (మంగళవారం) తెలంగాణ ` హైకోర్టు టీజీపీ ఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది.

Telangana

పరీక్షలను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు

ఇటీవల టీజీపీ ఎస్సీ(TGP SC) నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మెయిన్స్ పరీఓలను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని 20 మంది అభ్యర్థులు ఈ పిటీషన్లలో కోరారు. మరోవైపు ఇప్పటికే టీజీపీఎసీ గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్పత్తుల దశలో ఉన్న గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయరాదంటూ మరికొందరు ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా పిటీషన్లను దాఖలు చేశారు. ఇక హైకోర్టులో దాఖలైన అన్ని పిటీషన్లపై వాదనలు ముగిశాయి.మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. జులై 7న ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

గ్రూప్ 1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులను పెండింగ్లో పెట్టింది. అయితే అనూహ్యంగా హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులను పెండింగ్ లో పెట్టింది. అయితే అనూహ్యంగా హైకోర్టు గ్రూప్ 1 ఫలితాలను(Results) రద్దు చేస్తూ ఈ రోజు తీర్పు ఇచ్చింది.

ఆందోళనలో అభ్యర్థులు

అయితే హైకోర్టు తీర్పుతో గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సర్టిఫికెట్ల ధృవీకరణ పూర్తయింది. తుది నియామకాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ దశలో హైకోర్టు తీర్పుతో గ్రూప్-1 నియామకాల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత టీజీపీఎస్సీ సమీక్ష చేపడుతుంది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే డిగ్రీలు చేతపట్టుకుని సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు హైకోర్టు నిర్ణయం తీరని ఆవేదన మిగిల్చింది. ఒకవేళ పరీక్ష రద్దు చేస్తే తమ భవిష్యత్తు మరింతగా ఇబ్బందికి గురవుతుందని, తమ వయోపరిమితి కూడా ముగిసిపోతుందనే ఆందోళన అనేకుల్లో ఉంది.

హైకోర్టు ఏ ఫలితాలను రద్దు చేసింది?
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది.

హైకోర్టు రద్దు చేసిన కారణం ఏమిటి?

ఎంపిక ప్రక్రియలో లోపాలు, పారదర్శకత లోపించడం కారణంగా హైకోర్టు ఫలితాలను రద్దు చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-tummala-nageswara-rao-strict-measures-in-urea-distribution/breaking-news/543840/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870