Bhadrachalam: ఏళ్లనాటి రైల్వేలైన్ డబులింగ్ కల నెరవెరనుంది. భద్రాచలం రోడ్డు–డోర్నకల్ జంక్షన్(Road–Dornakal Junction)మధ్య డబులైన్ నిర్మాణంపై కొత్త ఆశలు చిగురించాయి. రైల్వే డబులైన్ కోసం భూసేకరణకు భారత ప్రభుత్వం నూతన గెజిట్ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని ఆరు గ్రామాల పరిధిలో 355 మంది రైతులనుంచి 32.03 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించనుంది.

భారీ వ్యయం, బడ్జెట్ కేటాయింపు
ఈ ప్రాంతంలో రెండవ రైల్వే లైన్(Railway Line) విస్తరణ కోసం రైల్వే శాఖ రూ.770.12 కోట్లు ఖర్చు చేయబోతుంది. అదే విధంగా 2023-24 బడ్జెట్లో రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. ఈ రైల్వే లైన్ డబులింగ్ ప్రక్రియ పూర్తయితే భద్రాచలం రోడ్డు–డోర్నకల్ మధ్య 54.43 కిలోమీటర్ల పరిధిలోని ఆరు స్టేషన్లకు సింగిల్ లైన్ కష్టాలు తప్పనున్నాయి. ఇక భద్రాచలం క్షేత్రానికి ప్రయాణం వేగవంతమవుతుంది. పర్యాటకపరంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టబోతుంది.
ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారు?
2023-24 బడ్జెట్లో రూ.100 కోట్ల నిధులు కేటాయించారు.
డబులింగ్ పూర్తయితే ఏ లాభాలు కలుగుతాయి?
ప్రయాణం వేగవంతమవుతుంది, సింగిల్ లైన్ ఇబ్బందులు తొలగుతాయి, అలాగే పర్యాటక, ఆధ్యాత్మిక, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: