📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Bhatti Vikramarka-యువ తెలంగాణ ప్రపంచంతో పోటీపడుతోంది

Author Icon By Pooja
Updated: September 7, 2025 • 8:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bhatti Vikramarka: హైదరాబాదు : తెలంగాణ రైజింగ్ 2047, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో(Indian School of Business) మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్సు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల పెట్టుబడితో ఒక్కో పాఠశాల నిర్మిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 104 పాఠశాలల నిర్మాణం ప్రారంభించినట్టు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చాకలి ఐలమ్మ పేరిట మహిళా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజాన్ని చైర్మన్గా నియమించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఐఎస్బి నిర్వాహకులు స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ను సందర్శించి వాటికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

విద్యలో నూతన మార్పులు

ఐఎస్బి విద్యార్థులు గొప్ప అదృష్టవంతులు. ఒక్కో తరగతి గది రూ.1.50 కోట్ల నుంచి రెండు కోట్ల వరకు వెచ్చించి నిర్మించారని అన్నారు. తాను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సింగిల్ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నానని, రాసుకునేందుకు పలకలు కూడా లేక పోవడంతో గురువులు ఇసుక పైనే అక్షరాలు దిద్దిన సందర్భాన్ని గుర్తుచేశారు. గురుపూజ దినోత్సవం రోజు ఐఎస్బి వంటి గొప్ప విద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయం అన్నారు. తాను ఈ స్థానానికి రావడానికి కృషి చేసిన గురువర్యులందరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గత ఒక్క ఏడాదిలోనే ఐఎస్బి దాదాపు 200 ప్రోగ్రాముల ద్వారా 6,000 మందికి పైగా ప్రొఫెషనల్స్‌కి శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐఎస్బి ని ఒక విద్యాసంస్థగానే కాకుండా, భాగస్వామిగా చూస్తుందని తెలిపారు.

భాగస్వామ్యం, అభివృద్ధి దిశగా తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య అధికారులకు శిక్షణ ఇవ్వడం నుండి, చేతివృత్తులు, ఎన్నికలు లేదా మెట్రో రైలు వంటి రంగాలపై స్వతంత్ర అధ్యయనాలు నిర్వహించడం వరకు, ఐఎస్బి తన పరిశోధన ద్వారా విధానాలను ఎలా మలచవచ్చో చూపిందని అన్నారు.దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ సెంటర్, లెక్చర్ హాల్స్, చర్చా స్థలాలు, మౌనంగా ఆలోచించడానికి మూలలు, ఆ ఆశయానికి ఓ నంగరంలా నిలుస్తుందన్నారు. ఈ సెంటర్ను ప్రారంభిస్తున్న సందర్భంలో, సహకారం అనే కొత్త యుగాన్ని ప్రారంభిద్దాం, రాష్ట్రం, విద్యాసంస్థలు, పరిశ్రమ కలిసి భారతదేశ భవిష్యత్తును మలచే మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దారిలో ధృఢ నిశ్చయంతో నడుస్తుందని తెలిపారు. విద్య అనేది కేవలం ప్రొఫెషనల్స్ తయారు చేయడమే కాకుండా, సమాజంకోసం, మానవత్వం కోసం నాయకులను తీర్చిదిద్దాలన్నది ప్రజా ప్రభుత్వ సంకల్పమని అన్నారు.

భవిష్యత్తు దిశలో తెలంగాణ

ఈ సెంటర్ భవిష్యత్ తరాలకు దిక్సూచి అవుతుందని, వారిని అగ్రగామిత్వం, సమానత్వం, ఆవిష్కరణల వైపు దారి చూపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కిల్స్ యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభమై, తొలి సంవత్సరంలోనే వందలాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. 2025 నాటికి దాని శాశ్వత కాంపస్ “ఫ్యూచర్ సిటీ”లో ఏర్పడనుంది. అలాగే, మొదటి దశలో 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూ.11,000 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మితమవుతున్నాయి.

ఈ పాఠశాలలు విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దడానికి, అకాడమిక్ నుండి పోటీ పరీక్షల వరకు శిక్షణనందిస్తాయని తెలిపారు. సహకారం, మార్గదర్శకత్వం, నిధులు లేదా భాగస్వామ్యం రూపంలో వాటి ప్రభావాన్ని మరింత పెంచి రాష్ట్రనిర్మాణం భావనను మరింత విస్తరించాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ఈ సెంటర్ మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుందని, ఎంత సీనియర్ అయినా నేర్చుకోవడం ఆగదని అన్నారు. ఉత్తమ నాయకులు(Best leaders) అంటే ఉత్తమ విద్యార్థులేనని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ సెంటర్ కేవలం ఎంబిఎలు, సిఇఒలు మాత్రమే కాకుండా భారతదేశం గర్వపడేలా సమస్యలకు పరిష్కారాలు కనుగొనే వ్యక్తులను తయారు చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఎంతగా నిర్ణయించబడింది?
తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది.

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి ఏమి చెప్పారు?
25 ఎకరాల విస్తీర్ణంలో, ఒక్కో స్కూల్ రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మించబడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 104 పాఠశాలలు ఒకేసారి ప్రారంభమవుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/training-in-foreign-languages-along-with-education-lokesh/andhra-pradesh/542696/

Breaking News in Telugu Deputy CM Bhatti Vikramarka Google News in Telugu ISB Latest News in Telugu Telangana economy Telangana Rising 2047 three trillion economy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.