📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

‘మద్యం’ విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు

Author Icon By Sudheer
Updated: February 12, 2025 • 10:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహంతెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘మద్యం’ విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు.ఎన్నికల ముందు మద్యం రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎంలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కొత్త పెరుగుదలలు ప్రకటించడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరల పెంపు వెనుక ప్రభుత్వాల ఆదాయ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో మద్యం నిషేధాన్ని అమలు చేస్తామని, ధరలను తగ్గిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ కూటమి నేతలు స్పష్టంగా ప్రకటించారు. అయితే తాజాగా మద్యం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేయాలని నిర్ణయించడంతో మందుబాబులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మద్యం వ్యాపారంలో అవకతవకలను సరిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఎక్సెజ్ శాఖ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం రాబట్టాలని చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ‘మద్యం’ విషయంలో మాట మార్చిన తెలుగు సీఎంలు.సీఎం రేవంత్ రెడ్డి జనవరిలో బీర్ల కంపెనీల గుత్తాధిపత్యాన్ని అరికడతామని, మద్యం రేట్లు పెంచేది లేదని ఘాటుగా ప్రకటించారు. అయితే నెల రోజులకే 15% ధరలు పెంచడంతో ప్రజలు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు.

ప్రభుత్వాలు మద్యం విక్రయం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆశిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తామని నేతలు చెబుతున్నా, ప్రజలపై భారం వేయడం తగదని విమర్శలు వస్తున్నాయి. ఈ పెరుగుదలలతో మద్యపానంపై ప్రభావం పడుతుందా? లేదా వినియోగదారులు మరింత ఎక్కువగా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారా? అన్నదానిపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మద్యం విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఇచ్చిన హామీలు, తర్వాత తీసుకున్న నిర్ణయాలు మధ్య పొంతన లేకపోవడంతో విమర్శలు పెరుగుతున్నాయి. అధికారంలోకి రాగానే మద్యం విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, రేట్లు పెంచడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారిందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ap-telangana Google news liquor liquor price hike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.