- సారా పై ఇప్పుడు సమగ్రంగా మాట్లాడలేo
- మంత్రి జూపల్లి కృష్ణారావు
Read Also: Fairs: కాలుష్యరహితంగా జాతరలు జరగాలి
Telangana: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై చేసిన వాఖ్యలు, అభిప్రాయాల పై లోతుగా అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ విషయం గా అసెంబ్లీ లో కూడా సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు.ఇప్ప పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇప్పపువ్వు తో చేసే సారా తాగి గతంలో మన పూర్వీకులు వందేళ్లు బతికారని, బ్రిటిష్ పాలకులు వారి స్వార్థం తో నిషేధించిన ఇప్ప పువ్వు సారా ను మళ్లీ తీసుకురావాలని, దీనివల్ల అటు ప్రభుత్వానికి ఇటు గిరిజనులకు కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన వాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే.
విశ్లేషణ
ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో నూతన పురపాలక సంఘం భవన ప్రారంభానికి విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ను మీడియా ప్రతినిధులు అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై చేసిన వాఖ్యల గురించి ప్రశ్నించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారా పై తాను చేసిన పరిశోధన కు సంబంధించిన పత్రాన్ని కూడా తనకు ఇచ్చారని దానిని నిపుణులకు ఇచ్చి విశ్లేషణ చేయిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ ఈ విషయం గా వెలిబుచ్చిన అభిప్రాయాల పై లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సాంప్రదాయ మద్యం తయారీ పై వివరించారని, ఇప్ప పువ్వు సారా అధికారింగా విక్రయిస్తున్న రాష్ట్రాలు, ఇప్ప పువ్వు సారా ను కంట్రీ లిక్కర్ గా కాకుండా ఇండియన్ మేడ్ లిక్కర్ గా అనుమతించిన గోవా రాష్ట్రం గురించి కూడా తెలిపారని మంత్రి వివరించారు. అసెంబ్లీ లో కూడా ఇప్ప పువ్వు సారా పై సమగ్రంగా చర్చిస్తామని, అందరి అభిప్రాయాలు పరిగణ లోకి తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. అయితే ఈ దశ లో ఇప్ప పువ్వు సారా పై తాను ఇంత కంటే ఎక్కువ మాట్లాడడం భావ్యం కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: