తెలంగాణలో(Telangana) ఆస్తి పన్ను, నల్లా బిల్లులు పెంచనున్నారనే ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకునే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కరీంనగర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు.
Read Also:Telangana: స్పీకర్కు సుప్రీంకోర్టు చివరి అవకాశం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆస్తి పన్ను లేదా నల్లా బిల్లులు పెంచుతామని ప్రచారం జరుగుతుండడం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రభుత్వం వద్ద ఈ విషయంలో ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు తాము ఒక్క పన్ను కూడా పెంచలేదని, పన్నుల పెంపు అంతా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే జరిగిందని విమర్శించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు.
పన్నుల భారం లేకుండా అభివృద్ధే లక్ష్యం
తమ ప్రభుత్వం(Telangana) పన్నులు పెంచకుండా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత పాలకులైన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు. అప్పుల భారం పెంచారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తూనే, కరీంనగర్ డంపింగ్ యార్డ్కు మాత్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ మేయర్ స్థానం తమదేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన, అనంతరం నగర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: