📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: సర్పంచ్‌లకు ప్రభుత్వం కొత్త కీలక అధికారాలు

Author Icon By Saritha
Updated: February 9, 2026 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలోని (Telangana) గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అధికారాలను అప్పగించింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల (Anganwadi centers) పర్యవేక్షణ పూర్తి బాధ్యత సర్పంచ్‌లపై ఉంటుంది. పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలను నివారించడం, అంగన్‌వాడీ కేంద్రాల సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: Telangana: నాలుగు రోజులు వరుస సెలవులు అవకాశం

అక్రమాలను అరికట్టేందుకు

గతంలో రెండేళ్లపాటు (Telangana) గ్రామాల్లో ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా గాడితప్పింది. చాలాచోట్ల పౌష్టికాహారం పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే కొలువుదీరిన కొత్త పంచాయతీ పాలకవర్గాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సర్పంచ్‌ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది.

కమిటీకి సర్పంచ్‌నే ఛైర్మన్‌గా నియమించబడగా, మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. ఇందులో అంగన్‌వాడీ టీచర్ కన్వీనర్‌గా, ఏఎన్‌ఎం, స్కూల్ సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి మరియు చిన్నారుల తల్లులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి నెలా కేంద్రాలకు అందుతున్న బియ్యం, పప్పు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి సరుకుల నాణ్యత, పంపిణీని పరిశీలిస్తుంది. అలాగే, ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణీలు, బాలింతలకు అందుతున్న భోజనాన్ని కూడా సమీక్షిస్తుంది. లక్షల రూపాయల విలువైన పోషకాహారం లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చూడటమే కమిటీ ప్రధాన విధి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

anganwadi centers Child Nutrition Food Distribution Monitoring Latest News in Telugu Telangana government orders Telangana Panchayat Sarpanches Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.