📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Maheshwar Reddy : తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Author Icon By sumalatha chinthakayala
Updated: March 27, 2025 • 6:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maheshwar Reddy: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. ఆప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్‌ చక్రవర్తిలా ఉంది. రాష్ట్ర దుస్థితికి మొదటి ముద్దాయి బీఆర్‌ఎస్‌ అయితే.. రెండో ముద్దాయి కాంగ్రెస్‌. డీలిమిటేషన్‌ మీద రాహుల్‌గాంధీ వైఖరి చెప్పాలి. 15 నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.1.63 లక్షల కోట్లు అప్పులు చేసింది. అప్పులు చేయటంలో మాత్రమే తెలంగాణ రైజింగ్‌ కనిపిస్తోంది.

గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం

గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల విధ్వంసం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం నడవటం బాధాకరం. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు. కాంగ్రెస్‌ కూటమిలో చేరేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. డీలిమిటేషన్‌తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై ఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చెప్పాలి. గత ప్రభుత్వం 11 శాతానికి తెచ్చిన వడ్డీలను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారో.. లేదో? చెప్పాలి. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారు? అని ఏలేటి ప్రశ్నించారు.

Alleti Maheshwar Reddy BJP Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telangana state Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.