News Telugu: Telangana SSC: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు!

Read Time:  1 min
Telangana SSC
Telangana SSC
FONT SIZE
GET APP

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. విద్యాశాఖ రూపొందించిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, 2026 మార్చి 18వ తేదీ (బుధవారం) నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ షెడ్యూల్‌ను ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం కోసం పంపించినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్ పరీక్షలు అదే రోజున ముగియనున్న నేపథ్యంలో, సమయానుకూలంగా టెన్త్ పరీక్షలు ప్రారంభించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Read also: Pensions: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్తో పెన్షనర్లకు సౌకర్యం: శ్రీధర్ బాబు

Telangana SSC

Telangana SSC: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు

ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని

ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే, వచ్చే 2 నుంచి 3 రోజుల్లో పూర్తి పరీక్షా షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని తెలంగాణ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ (TGHMA) విద్యాశాఖను అభ్యర్థించింది. అనేక మంది విద్యార్థులు ఇంకా ఫీజు చెల్లింపును పూర్తి చేయలేదని, గడువు పొడిగిస్తే మరింతమంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.