📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: యూరియాకు ప్రత్యేక అధికారులు

Author Icon By Tejaswini Y
Updated: December 31, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వ్యవసాయ డైరెక్టర్ గోపి ఉత్తర్వులు

Telangana : రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత యాసంగి సీజన్ సాగుకు సంబంధించి యూరియా పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజను(Rabi Season)కు రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నప్పటికీ వాటి పంపిణీ తలెత్తుతున్న లోపాలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ప్రధానంగా యూరియా అందుబాటులో ఉన్నా రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి వెల్లడించారు.

Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్

Telangana: Special officers for urea

ఈ మేరకు దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా ఒక్కొక్క ప్రత్యేక అధికారికి నాలుగైదు జిల్లాలను కేటాయించారు. జిల్లాల్లో యూరియా పంపిణి సక్రమంగా జరిగేలా వీరంతా మానిటరింగ్ చేయనున్నారు. ఈ ప్రత్యేక అధికారులుగా వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్లు కే. విజయ్ కుమార్, బి.నర్సింహారావు, అడిషనల్ డైరెక్టర్లు ఎస్.గీత, వి. ఆశాకుమారి, వై. సుచరిత, బి. బాలు, ఎం. శైలజ, డిప్యూటీ డైరక్టర్లు ఎం.చంద్రశేఖర్, ఎం. కనకరాజులకు బాధ్యతలు అప్పగించారు.

వీరంతా పైలట్ ప్రాజెక్టు కింద యూరియా యాప్ కొనసాగుతున్న ఐదు జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో కూడా సక్రమంగా పంపిణీ(Urea Distribution) చేసేలా చర్యలు తీసుకోనున్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా పంపిణి చేసేలా ప్రత్యేక అధికారులు జిల్లాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.