📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

Author Icon By Saritha
Updated: March 2, 2026 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad) చర్యలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఆయన అధికారికంగా నోటీసులు జారీ చేశారు. వీరిపై వచ్చిన అనర్హత పిటిషన్లపై సమగ్ర విచారణ జరపాలని స్పీకర్ నిర్ణయించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి గతంలోనే ఈ ఇద్దరు నేతలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా స్పీకర్ ఈ నోటీసులు పంపారు.

Read Also: Budget tablets 2026: బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్లు ఇవే!

Telangana: Speaker issues notices to Danam Nagender and Kadiyam Srihari

ఇప్పటికే తాము అధికారికంగా పార్టీ మారలేదని దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్‌కు ప్రాథమిక వివరణ ఇచ్చారు. అయితే, కేవలం సమాధానంతో సరిపెట్టకుండా, తగిన ఆధారాలతో స్వయంగా విచారణకు హాజరుకావాలని స్పీకర్ తాజా నోటీసుల్లో స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ విచారణను చేపడుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మార్చి 4న జరిగే విచారణలో ఎమ్మెల్యేలు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారు? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

brs congress DanamNagender KadiyamSrihari Latest News in Telugu TelanganaSpeaker Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.