తెలంగాణ (Telangana) లో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, రెండో జాబితా పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. త్వరలో రెండో విడత లబ్దిదారుల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ ఈ విడతలో ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు.
Read Also: IBomma: ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
5 లక్షల ఆర్థిక సాయం
రాజకీయాలను పక్కనపెట్టి పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు.ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించే పేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆ మొత్తం నిధులు జమ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పేదలు ఇంటి నిర్మాణ పనులు మెుదలు పెట్టారు. మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: