📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం

Author Icon By Anusha
Updated: February 4, 2026 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా తెలంగాణ (Telangana) ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. భక్తుల రాకపోకలతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడగా, మొత్తం మీద రూ.3.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏటా జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, ఆర్టీసీ విస్తృత స్థాయిలో ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. మేడారం జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖమ్మం, ఇల్లెందు,

Read Also: Jagtial: పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్

Telangana: RTC earns Rs 3.28 crore from Medaram fair

కోటికి పైగా ఆదాయం

ఏటూరినాగారం, చర్ల, వెంకటాపురం, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, మంగపేట ప్రాంతాల నుంచి మొత్తం 214 ప్రత్యేక బస్సులను నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా సుమారు రెండు లక్షల మంది భక్తులు మేడారానికి సురక్షితంగా రాకపోకలు సాగించారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా సర్వీసులు నిర్వహించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.. ముఖ్యంగా కొత్తగూడెం డిపో నుంచి 90 బస్సుల ద్వారా 45,431 మందిని తరలించగా, రూ. కోటికి పైగా ఆదాయం వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news medaram jathara Sammakka Saralamma Jatara telangana rtc Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.