వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ(Telangana) ప్రభుత్వానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవడంపై ఆర్థికశాఖ శ్రద్ధ పెట్టింది. కొత్త బడ్జెట్ను వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో శాసనసభ(Legislature)లో ప్రవేశపెట్టాలని ఉద్దేశ్యంతో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసి, తమ ప్రతిపాదనలు సమర్పించమని ఆర్థికశాఖ ఆహ్వానించింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఆదాయ లక్ష్యాలపై తుది పరిణామాలు, మార్పులను వచ్చే 2026-27 బడ్జెట్ ప్రతిబింబింపజేయనుంది.
Read Also: Bollaram: హైదరాబాద్లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక
వచ్చే ఫిబ్రవరి–మార్చిలో కొత్త బడ్జెట్, ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభం
ప్రస్తుత 2025-26 బడ్జెట్ ప్రకారం మొత్తం ఆదాయం రూ.2.84 లక్షల కోట్లుగా ఉండాలి. కానీ మార్చి నాటికి ఇది రూ.2.60 లక్షల కోట్ల వరకు పరిమితం కావచ్చని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖల నుండి ప్రతిపాదనలు అందిన తర్వాత, సంబందిత శాఖల కార్యదర్శులు, మంత్రులతో కలిసి ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బడ్జెట్ కేటాయింపుల అందనాలపై కొత్త బడ్జెట్పై దృష్టి.. 2026-27కు శాఖల వారీగా ఫోకస్. సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుత ఏదారి పన్నుల వసూళ్లపై ప్రతిపాదనలు అందిన తర్వాత, శాఖల కార్యదర్శులు, మంత్రులతో కలిసి ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు బడ్జెట్ కేటాయింపుల బండనాలపై సంబంధిత శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు.

ఈ నేపధ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక అంశాలపై ఆ శాఖ అధికారులు దృష్టిసారించారు. ప్రధానంగా పన్నుల పసూళ్ల విషయమై పునరాలోచన చేస్తున్నారు. ప్రస్తుత 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక శాఖ బడ్జెట్లో ప్రభుత్వం పన్నుల ద్వారా రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు రూ.1 లక్ష కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మాన్సి వాణికి వర్యులు వసూళ్లు బాగా పెరగవచ్చని అంచనా కాగా మార్చి నెలాఖరు వరకు రూ.2.60 లక్షల కోట్ల ఆదాయం సాధ్యమా అనేదానిపై ఆర్థిక శాఖ తర్జన భర్జనలు పడుతోంది, ఇందులో భాగంగా గతేడాది 2024-25 ఆర్థిక సంవత్సరం కన్నా ప్రస్తుత 2025-26లో 10 శాతం ఎక్కువ పన్నుల వసూళ్లు సాధించమని ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన శాఖలను ఆదేశించింది.
గ్లోబల్ సమిట్, మూసీ పునరుజ్జీవం, ప్రభావంతో ఆదాయ అంచనాలు
2024-25లో పన్ను ల ద్వారా రూ.1.64 లక్షల కోట్లకు చివరికి రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే సాధించగలిగింది. దీన్ని దృష్టిలో ఉందురుని ప్రస్తుత 2025-26లో రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యానికి చేరే అవకాశం ఉన్నప్పటికీ, మార్చి నాటికి సాధ్యమైన వసూళ్లు రూ.2.60 లక్షల కోట్ల పరిధిలోనే ఉండవచ్చని ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. కాగా గ్లోబల్ సమిట్, మూసీ పునరుజ్జీవం, ప్రాంతీయ వలయ రహదారి(ఆర్ఆర్ఆర్ వంటి ప్రాజెక్టుల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుందని, దీనివల్ల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరి నాటిక్ పన్ను వసూళ్లలో గణనీయమైన పెరుగుదల రానుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థికంలో వన్నేతర ఆదాయం. కేంద్రం నుండి అందుకునే గ్రాంట్లను కలిపి రూ.53. వేల కోట్లకుపైగా రావచ్చని బడ్జెట్లో అంచరా. అయితే ఇప్పటివరకు వాటిలో కేవలం రూ.11 వేల కోట్ల మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్లో ఈ వసూళ్లను పెంచాలా, లేక ఇంతే స్థాయిలో కొనసాగించాలా అనే చర్చ జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: