Rajya Sabha Elections: తెలంగాణ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీల పదవీకాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. బీఆర్ఎస్ నేత కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ ల గడువు ముగియనుండటంతో, తదుపరి ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
Read Also: Korutla News: బురఖా ధరించి మహిళల మధ్య అనుమానితుడు..
అసెంబ్లీలో కాంగ్రెస్ బలం
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం, రెండు రాజ్యసభ స్థానాలను సులభంగా గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఉంది. అంతేకాకుండా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సింఘ్వీకి రెన్యువల్?
ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఎంపీ అభిషేక్ సింఘ్వీకి మరోసారి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రెండో స్థానం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ‘ఇండియా’ కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: