Raitu Bharosa scheme : రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!

Read Time:  1 min
Raitu Bharosa scheme
Raitu Bharosa scheme
FONT SIZE
GET APP

Raitu Bharosa scheme : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలులో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ పథకంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఇకపై నిజంగా సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధులు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సాగుకు అనుకూలంగా లేని భూములకు, గతంలో మాదిరిగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ వెల్లడించారు. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూముల పేరుతో కూడా గతంలో నిధులు పొందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులకు ఇకపై అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.

Read also: Women T20 Series: రెండో టీ20లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వైజాగ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు రెండు సీజన్లకు మొదట రూ.8 వేలు, (Raitu Bharosa scheme) ఆ తర్వాత రూ.10 వేలు వరకు పెట్టుబడి సాయం అందించారు. అయితే, ఈ పథకంలో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసా పథకంగా మార్చి, ఎకరాకు పెట్టుబడి సాయాన్ని రూ.6 వేలుగా నిర్ణయించింది. అయినప్పటికీ, అర్హత లేని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇకపై సాగు జరుగుతున్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేయాలని ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్లు సీఎం రేవంత్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.