బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి (Surface Trough) త్వరలోనే అల్పపీడనంగా (Low Pressure) మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ పరిణామం కారణంగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. బుధవారం నుంచి ములుగు (Mulugu), జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally), భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem), కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad), ఆదిలాబాద్ (Adilabad), మంచిర్యాల (Mancherial) జిల్లాల్లో అక్కడక్కడుగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు సూచనలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేమ పెరిగే కారణంగా ఉరుములు, మెరుపులుసంభవించే అవకాశం ఉందని తెలిపారు.
అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం
ఇంకా, జనగాం , సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ , హన్మకొండ, మహబూబాబాద్,జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ (Yellow Alert) ప్రకటించారు. ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.ముఖ్యంగా రేపు ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల (Thunderstorms) తో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వర్షాలతో పాటు గాలుల వేగం పెరగడం వల్ల పంటలకు, మౌలిక వసతులకు నష్టం జరుగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం
ఇక ఎల్లుండి నిజామాబాద్, జగిత్యాల (Jagityala), పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాన తీవ్రత పెరగవచ్చని, లోతట్టు ప్రాంతాల్లో జలమునిగే ప్రమాదం ఉండటంతో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ వర్షాల ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరే ప్రమాదం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలు వర్ష సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని, నదీ ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Adi Srinivas: బిజెపి బిసి నేతలు రిజర్వేషన్ పై నోరు విప్పాలి